ఎన్టీఆర్ జిల్లా, నందిగామ మండలం, లింగాలపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పేరంటాళ్ళ అమ్మవారు కోరిన కోర్కెలు తీర్చే చల్లని దేవత. ఆ గ్రామంలో ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్నిమ రోహిణీ కార్తె రోజున పసుపు, కుంకుమలు అమ్మవారి పుట్టినిల్లు అయిన దుగ్గి ధర్మవరం నుండి తీసుకురావటం జరుగును. ఆ రోజు నుండి 5 రోజులు అమ్మవారి తిరుణాళ్ల మహోత్సవం అంగ రంగ వైభవంగా జరుపుకొనుచున్నాము. మరియు అమ్మవారి తిరుణాళ్ల మహోత్సవం సందర్బంగా ఒంగోలుజాతి ఎడ్ల బండలాగుడు ప్రదర్శన జరుగును
ఈ గ్రామం లో స్వయం గా వెలసి భక్తుల ఆరాధ్య దైవము గా విరాజిల్లుతూ నిత్య పూజలు అందుకొనుచున్న శ్రీ లక్ష్మీ పేరంటాళ్ళ అమ్మవారు శ్రీ చిన్నకేశవస్వామి వరప్రసాదంగా జన్మించి సుమారు 17 వ శతాబ్దమున శ్రీ లక్ష్మీ పేరంటాళ్ళ అమ్మవారు సంతానం లేనివారికి సంతానం ప్రసాదించే సంతాన లక్ష్మీగా, భక్తుల కోరికలను తీర్చుచూ చల్లగా కాపాడే చల్లని తల్లి శ్రీ లక్ష్మమ్మ గా పేరొందెను. శ్రీ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవములు విద్యుత దీపాలంకరణలతో అత్యంత వైభవం గా జరుగును.
దాతల ఆర్థిక సహకారం తో నూతనంగా కోటిరూపాయల వ్యయం తో శ్రీ లక్ష్మీ పేరంటాళ్ళ అమ్మవారి దేవస్థానము నిర్మాణం జరిగి అత్యంత శోభాయమానంగా వెలుగొందుచున్నది. 2016 కృష్ణా పుష్కారాల నిధులతో దేవాలయం 3 వైపులా ప్రహరీ గోడ దేవాలయం చుట్టూ సిమెంట్ ఫ్లోరింగ్ చేయబడినది.