గుడి గురించి

దేవాలయ నిర్మాణం, స్థలపురాణం:
లక్ష్మమ్మ బంగారు శిలగా వెలిసిన తర్వాత బావ సుబ్బయ్య, గ్రామస్తులు, పెద్దలు కలిసి లక్ష్మమ్మకు సుమారు 300 సంవత్సరాల క్రితం ప్రస్తుత ఉన్న దేవాలయం వద్ద గుడిని నిర్మించి విగ్రహాన్ని చేయించి ప్రతిష్టించారు కాలక్రమేనా అమ్మవారి దేవాలయం శిథిలావస్తుకు చేరడంతో 2011 ఫిబ్రవరి నెల మాఘమాసం 18వ తేదీన ఏక దశాహ్నిక దీక్షతో 11 రోజులపాటు అమ్మవారి పున ప్రతిష్ట గర్భాలయ ప్రవేశం జరిగింది అమ్మవారి దేవాలయంతో పాటు గ్రామంలో ఉన్న 41 ఇతర దేవతామూర్తుల ప్రతిష్ట కూడా జరిగింది ఆనాటి నుండి ప్రతి సంవత్సరం మాఘమాసంలో అమ్మవారి దేవాలయ వార్షికోత్సవం శ్రీ పర్వత వర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి వారి వార్షిక శాంతి కల్యాణోత్సవం జరిపించి అన్నప్రసాద కార్యక్రమాలు నిర్వహిస్తూవున్నారు.


అమ్మవారి మహిమలు:
అమ్మవారు దేవతగా వెలిసిన వెంటనే తన భర్త వెంకయ్య అత్త అచ్చమ్మ,ఆడబిడ్డ పిచ్చమ్మలు తమ తప్పులను మన్నించి చూపులు ప్రసాదించమని వేడుకున్నారు. వెంటనే వారి పచ్చాతాపాన్ని క్షమించి లక్ష్మమ్మ వారికి చూపును ప్రసాదించింది. లక్ష్మమ్మ శ్రీ చెన్నకేశవ స్వామి వారి వరప్రసాదముగా జన్మించి భక్తులు ఆరాధ్య దైవతగా కొలవబడుతుందని శ్రీ మధ్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి కాలజ్ఞానంలో పేర్కొనబడింది. ఆనాటి నుండి లక్ష్మమ్మ శ్రీ లక్ష్మీ పేరంటాల అమ్మవారిగా భక్తుల కోరికలు తీరుస్తూ గ్రామాన్ని రక్షిస్తూ ఉంది.


అమ్మవారి గుండం (సమాధి):
లక్ష్మమ్మ బంగారు శిలగా వెలిసిన ప్రదేశంలో గుర్తుగా ఒక రాతిశిలను ప్రతిష్టించి ప్రతి సంవత్సరం తిరునాళ్ళలో గుండం(సమాధి) వద్దకు అత్తవారిల్లు(చిరుమామిళ్ల) వారింటి నుండి ప్రభ వెళ్లడం ఆనవాయితీగా వస్తుంది. కాలక్రమేనా భక్తులు దర్శనం కోసం 2021 మే 13న వైశాఖమాసంలో గుండం దగ్గర దేవాలయాన్ని నిర్మించి పూజలు చేస్తూ ఉన్నారు. అమ్మవారి భూములు అమ్మవారి దేవాలయ నిర్మాణం జరిగిన తరువాత పూర్వకాలంలో పెద్దలు చిరుమామిళ్ల అచ్చమ్మ గారు, తల్లి రామలక్ష్మమ్మ గారు, వెంకయ్య గారు,పంగులూరి లక్ష్మమ్మ గార్లు సుమారు 70 ఎకరాల భూమిని అమ్మవారికి భక్తితో సమర్పించారు.


తిరునాళ్లు:
ప్రతి సంవత్సరం వైశాఖమాసంలో వచ్చే పౌర్ణమి నుండి ఐదు రోజులపాటు అమ్మవారి తిరునాళ్ల అత్యంత వైభవంగా నిర్వహిస్తారు అలాగే ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి అమ్మవారిని కృష్ణా నదికి స్నానానికి తీసుకెళ్లి రంగుల ఉత్సవం నిర్వహించడం జరుగుతుంది.


ఇతర ఆలయాలు:
శ్రీ లక్ష్మీ పేరంటాల అమ్మవారు వెలసిన వెంటనే అమ్మవారు స్వయంగా కోరిన వెంటనే అనంత లక్ష్మి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి వారు కూడా సతీసమేతంగా ఇక్కడ వెలిశారు. అలాగే అమ్మవారి మనుమరాలు అయిన పద్మావతి దేవి కూడా ఇక్కడే వెలుగొందుచూ ఉన్నది. ఆదిశక్తి,అంకాల శక్తి అయిన అంకమ్మ తల్లి కూడా ఈ గ్రామంలో అమ్మవారితో పాటు నిత్య పూజలు అందుకుంటుంది. గోవిందస్వామి శ్రీ పర్వత వర్ధని సమేత రామలింగేశ్వర స్వామి, శ్రీ భక్తాంజనేయ స్వామి, మారెమ్మ,మైసమ్మ, మహాలక్ష్మమ్మ, ముత్యాలమ్మ, నాభిశిల వంటి మొత్తం 41 దేవతామూర్తులును లింగాలపాడు గ్రామంలో ప్రతిష్టించడం అత్యంత శోభాయమానంగా చెప్పవచ్చు. లింగాలపాడు లో దేశంలోనే ఎక్కడ లేని విధంగా గ్రామాన్ని నలుదిక్కులా అనగా "నైరుతి దిక్కున ఆదిశక్తి", "వాయువు దిక్కున భద్రకాళి", "ఈశాన్ని దిక్కున బేతాళుడు"," ఆగ్నేయ దిక్కున దుర్గి" దేవతల వంటి విగ్రహాలను ప్రతిష్టించడం జరిగింది ఈ శిలలు అమ్మవారి అవతరణ కంటే కూడా ముందు నుంచే ఉన్నవి ప్రతి సంవత్సరం అమ్మవారి తిరునాళ్ల మహోత్సవంలో భాగంగా మూడవ రోజున ఈ నాలుగు దేవతలమూర్తులకు ముందుగా బోనాల చెల్లించిన తర్వాత అమ్మవారి బోనాల కార్యక్రమం జరుగుతుంది. అమ్మవారు ఇతర దేవతామూర్తులతో కూడి రథోత్సవం కార్యక్రమం జరుగుతున్న రోజున స్వయంగా వెలిసిన బంగారు విగ్రహలను దర్శించవచ్చు. అమ్మవారిని పొడిచిన కత్తి ఇతర వస్తువులు కూడా దర్శించవచ్చు.

చిత్రాలు

శ్రీ లక్ష్మమ్మ దేవాలయం
శ్రీ లక్ష్మమ్మ అమ్మవారు
శ్రీ లక్ష్మమ్మ అమ్మవారు,
శ్రీ లక్ష్మమ్మ అమ్మవారు,
శ్రీ లక్ష్మమ్మ అమ్మవారి ఊరేగింపు
శ్రీ లక్ష్మమ్మ అమ్మవారి ఉయ్యాల సేవ
అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న దృశ్యం


Back to Top